Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలహీనపడినా ప్రభావం తగ్గని బురేవి.. ఆంధ్రాకు విస్తారంగా వర్షాలు!

Webdunia
ఆదివారం, 6 డిశెంబరు 2020 (09:38 IST)
బంగాళాతంలో ఏర్పడిన అల్పపీడనం తొలుత వాయుగుండంగా, ఆపై తుపానుగా మారిన బురేవి ఈ నెల 4వ తేదీ ఉదయం తమిళనాడులోని కన్యాకుమారి, పంబం తీరంలో తీరాన్ని దాటింది. అయితే, ఇది తీరందాటకముందే బలహీనపడింది. అయినప్పటికీ.. దీని ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. ఫలితంగా అటు తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు.. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 
 
ఇదే అంశంపై భారత వాతావరణ శాఖ ఓ ప్రకటన జారీచేసింది. బురేవి తుపాను బలహీనపడి అల్పపీడనంగా ఇంకా బంగాళాఖాతంలో కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో తమిళనాడులోని అనేక ప్రాంతాలతో పాటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి.
 
ముఖ్యంగా, ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశమున్నట్టు తెలిపింది. 
 
కాగా, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తమిళనాడు తీరం దాటి అరేబియా సముద్రంలో ప్రవేశిస్తుందని, ఆపై క్రమంగా బలపడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments