Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగ్ దోసెకి డబ్బులివ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (13:42 IST)
చిత్తూరుజిల్లా చంద్రగిరి నియోజవకర్గం పాకాల మండలం ఇరంగారిపల్లి పంచాయతీ తలారివారిపల్లికి సాయికిరణ్‌  స్థానికంగా ఉన్న గుర్రప్పకుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. 
 
సాయికిరణ్ బిటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. స్థానికంగా ఉన్న వేము ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. స్నేహితులతో కలిసి ప్రతిరోజు ఉదయం బయట టిఫిన్ చేసేవాడు సాయికిరణ్.
 
అయితే హోటల్ ఫుడ్ తినొద్దని, ఇంటిలో చేసే టిఫిన్ తినమని తల్లిదండ్రులు పదేపదే చెప్పినా వినిపించుకునేవాడు కాదు సాయికిరణ్. హోటల్ తిండి తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని హెచ్చరించారు కూడా. కానీ సాయికిరణ్ మారలేదు.
 
ఈరోజు ఉదయం కూడా తను ఎగ్ దోసి తినాలని.. డబ్బులు ఇవ్వాలని కోరాడు. తల్లిదండ్రులు ఇందుకు ససేమిరా అన్నారు. దీంతో మనస్థాపానికి గురైన సాయికిరణ్ ఇంటికి సమీపంలో ఉన్న కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కిరణ్ మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments