ఎగ్ దోసెకి డబ్బులివ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (13:42 IST)
చిత్తూరుజిల్లా చంద్రగిరి నియోజవకర్గం పాకాల మండలం ఇరంగారిపల్లి పంచాయతీ తలారివారిపల్లికి సాయికిరణ్‌  స్థానికంగా ఉన్న గుర్రప్పకుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. 
 
సాయికిరణ్ బిటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. స్థానికంగా ఉన్న వేము ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. స్నేహితులతో కలిసి ప్రతిరోజు ఉదయం బయట టిఫిన్ చేసేవాడు సాయికిరణ్.
 
అయితే హోటల్ ఫుడ్ తినొద్దని, ఇంటిలో చేసే టిఫిన్ తినమని తల్లిదండ్రులు పదేపదే చెప్పినా వినిపించుకునేవాడు కాదు సాయికిరణ్. హోటల్ తిండి తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని హెచ్చరించారు కూడా. కానీ సాయికిరణ్ మారలేదు.
 
ఈరోజు ఉదయం కూడా తను ఎగ్ దోసి తినాలని.. డబ్బులు ఇవ్వాలని కోరాడు. తల్లిదండ్రులు ఇందుకు ససేమిరా అన్నారు. దీంతో మనస్థాపానికి గురైన సాయికిరణ్ ఇంటికి సమీపంలో ఉన్న కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కిరణ్ మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments