యూఎస్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (13:27 IST)
అమెరికా పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయలుదేరారు. బుధవారం ఉదయం గం.11.30 ప్రాంతంలో ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరి వెళ్లారు. మొత్తం మూడు రోజుల పాటు మోడీ యూఎస్‌లో పర్యటించనున్నారు.
 
ఈ సమయంలో ఆయన పలు కీలక భేటీల్లో పాల్గొంటారు. ఆస్ట్రేలియా, జపాన్, ఇంకా యుఎస్‌లతో జరుగబోతోన్న మొదటి క్వాడ్ ఇన్ పర్సనల్ సమావేశంలో పాల్గొనడమే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. 
 
దీంతోపాటు, న్యూయార్క్‌లో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీలో కూడా ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఇక, ఈ పర్యటనలో అగ్రరాజ్య దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో కూడా భారత ప్రధాని భేటీ అవుతారు. ఈ భేటీపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
ముఖ్యంగా, ఆప్ఘనిస్థాన్‌ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు హస్తగతం చేసుకోవడం, ఆ దేశ రాజకీయాల్లో పాకిస్థాన్, చైనా వంటి దేశాలు జోక్యం చేసుకోవడం వంటి పరిణామాలపై ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అందుకే మోడీ, బైడన్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments