Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఎస్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (13:27 IST)
అమెరికా పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయలుదేరారు. బుధవారం ఉదయం గం.11.30 ప్రాంతంలో ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరి వెళ్లారు. మొత్తం మూడు రోజుల పాటు మోడీ యూఎస్‌లో పర్యటించనున్నారు.
 
ఈ సమయంలో ఆయన పలు కీలక భేటీల్లో పాల్గొంటారు. ఆస్ట్రేలియా, జపాన్, ఇంకా యుఎస్‌లతో జరుగబోతోన్న మొదటి క్వాడ్ ఇన్ పర్సనల్ సమావేశంలో పాల్గొనడమే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. 
 
దీంతోపాటు, న్యూయార్క్‌లో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీలో కూడా ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఇక, ఈ పర్యటనలో అగ్రరాజ్య దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో కూడా భారత ప్రధాని భేటీ అవుతారు. ఈ భేటీపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
ముఖ్యంగా, ఆప్ఘనిస్థాన్‌ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు హస్తగతం చేసుకోవడం, ఆ దేశ రాజకీయాల్లో పాకిస్థాన్, చైనా వంటి దేశాలు జోక్యం చేసుకోవడం వంటి పరిణామాలపై ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అందుకే మోడీ, బైడన్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments