Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో చూసిన బంధువులు, అంతే...

Advertiesment
married woman
, మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (21:17 IST)
పెళ్ళయ్యింది. పిల్లలు లేరు. డబ్బులు సంపాదించడానికి భర్త విదేశాలకు వెళ్ళిపోయాడు. ఒంటరితనం. బాగా చదువుకోవడంతో ఉద్యోగంలోకి వెళ్ళింది. అక్కడే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే తన విషయాన్ని బయటకు రాకుండా ఎన్నోరోజులు జాగ్రత్తపడ్డ వివాహిత ఉన్నట్లుండి బయటపడటంతో ఆత్మహత్యకు పాల్పడింది.
 
కేరళ రాష్ట్రం అలపుజకు చెందిన సతీష్ అనే 28 యేళ్ళ వ్యక్తికి, సవిత అనే యువతికి రెండేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. విదేశాల్లో ఉద్యోగం దొరకడంతో తన ఇంటిలోనే సవితను వదిలి వెళ్ళాడు సతీష్. ఇంతవరకు ఇండియాకు రాలేదు. అయితే ఇంట్లో బోర్ కొడుతుందని ఒక సూపర్ మార్కెట్లో ఉద్యోగంలో చేరింది సవిత.
 
అక్కడే మేనేజర్‌గా విధులను నిర్వర్తిస్తోంది. మరో మేనేజర్ ప్రవీణ్ కూడా సవితతో పాటు కొత్తగా ఉద్యోగంలో చేరాడు. మేనేజర్లు కావడంతో ఇద్దరి మధ్యా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. డ్యూటీకి వచ్చినప్పుడు సైలెంట్‌గా ఉండే వీళ్ళు డ్యూటీ అయిపోయిన తరువాత భార్యాభర్తల్లాగా బయట తిరుగుతూ తెగ ఎంజాయ్ చేసేవారు. తన ఇంట్లో వారికి తెలియకుండా జాగ్రత్తగా పడింది సవిత. 
 
అయితే రెండురోజుల క్రితం ఆదివారం కావడంతో ప్రియుడిని కలుసుకునేందుకు బయటకు వచ్చింది. సాయంత్రం వరకు ప్రియుడితో తిరిగి ఆ తరువాత ఇంటికి రావడానికి సిద్ధమైంది. అయితే సతీష్ బంధువులు సవితను ప్రవీణ్‌తో చూశారు. ఈ విషయాన్ని గమనించిన సవిత ఆందోళనకు గురైంది. 
 
తన భర్తకు విషయం ఎక్కడ తెలిసిపోతుందన్న భయంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమేంటో కూడా లేఖలో రాసింది. తన భర్తకు క్షమాపణ చెబుతూ లేఖలో కూడా రాసింది సవిత.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివేకా హత్య కేసు.. మీడియా ప్రతినిధులకు సీబీఐ నోటీసులు