Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు యాత్రకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన సీఎం జగన్ ... ఎందుకో తెలుసా?

వరుణ్
సోమవారం, 22 ఏప్రియల్ 2024 (15:25 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను చేపట్టిన బస్సు యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఈ నెల 26న తేదీన వైకాపా మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉండటంతో ఈ మేనిఫెస్టో రూపకల్పన అంశంపై దృష్టిసారించేందుకు వీలుగా ఈ బస్సు యాత్రను వాయిదావేశారు. అలాగే, మంగళవారం తన పార్టీకి చెందిన సోషల్ మీడియా వింగ్‌తో జగన్ సమావేశంకానున్నారు. 
 
ఇదిలావుంటే, సోమవారం ఉత్తరాంధ్రకు సంబంధిచి ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు పాల్గొంటారు. ఈ భేటీలో ఎన్నికల ప్రచారం, ఓటర్లను ఆకర్షించడం తదితర అంశాపై వ్యూహరచన చేయనున్నారు. 
 
మరోవైపు, ఈ నెల 26వ తేదీన వైకాపా మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మేనిఫెస్టో రూపకల్పనపై జగన్ ప్రత్యేకంగా దృష్టిసారించనున్నారు. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిని మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలు ఉన్నాయి. మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమికి ధీటుగా వైకాపా నేతలు మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు. 
 
మంగళవారం వైకాపా సోషల్ మీడియా వింగ్‌తో జగన్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. సోషల్ మీడియా వింగ్‌తో సమావేశం త ర్వాత బస్సు యాత్రను మళ్లీ ప్రారంభమవుతుంది. మంగళవారం విజయనగరం జిల్లా బస్సు యాత్ర కొనసాగుతుంది. రోడ్ షో, బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments