Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెయిన్‌డెడ్ -22 ఏళ్ల యువకుడి అవయవదానం.. నలుగురికి ప్రాణం పోసింది..

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (12:20 IST)
విజయవాడలోని మణిపాల్‌ హాస్పిటల్స్‌లో బ్రెయిన్‌డెడ్‌కు గురైన 22 ఏళ్ల యువకుడి అవయవదానం నలుగురు రోగులకు కొత్త జీవితాన్ని అందించింది. వుజ్జూరి దినేష్ తన బైక్‌పై వెళుతుండగా విషాదకరంగా ప్రమాదానికి గురై తలకు బలమైన గాయమైంది. వైద్య నిపుణులు ఎంత ప్రయత్నించినప్పటికీ, దినేష్ ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కనిపించలేదు. అతని బ్రెయిన్ డెడ్‌ అని వైద్యులు ప్రకటించారు. 
 
అయితే దుఃఖంలో ఉన్న అతని తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నాగలక్ష్మిల నుండి అంగీకారంతో దినేష్ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో నిబంధనల ప్రకారం అవయవదానం జరిగింది. ఈ అవయవ దానంతో విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రిలో రోగులకు కాలేయం, ఒక కిడ్నీ దానంగా ఇవ్వడం జరిగింది. అదనంగా, అతని కళ్లను ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి దానం చేశారు. ఇది దృష్టిలోపం ఉన్నవారికి ఆశాజనకంగా ఉంది.
 
మరో కిడ్నీని విజయవాడలోని విజయా ఆసుపత్రికి తరలించగా, ఊపిరితిత్తులను మార్పిడి కోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. దినేష్ దాతృత్వం నలుగురికి పునర్జన్మ లభించిందని వైద్యులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments