Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మాండమైన కథ-కథనంతో .... "బ్రహ్మ రాసిన కథ"

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (12:56 IST)
తెలుగు సినిమా రంగంలో మహిళా నిర్మాతల ప్రాతినిధ్యం ఇప్పటికీ తక్కువగానే ఉంది. ఆ లోటును ఎంతోకొంత భర్తీ చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటున్నారు డైనమిక్ లేడి "సింధు నాయుడు". ఓ రేంజ్ ప్రొడక్షన్స్ పేరిట నిర్మాణ సంస్థను నెలకొల్పిన సింధు నాయుడు... తొలి ప్రయత్నంగా "బ్రహ్మ రాసిన కథ" అనే ఇండిపెండెంట్ చిత్రాన్ని నిర్మించారు. 
 
 
నవీన్ సంకు దర్శకత్వంలో, లారెన్స్ నరేష్-శ్రీలయ జంటగా రూపొందిన ఈ చిత్రం.. ప్రేమలోని ఓ సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని డైనమిక్ లేడి ప్రొడ్యూసర్ సింధు నాయుడు చెబుతున్నారు. 
సాక్షాత్తూ సరస్వతీదేవి సిఫార్సుతో బ్రహ్మదేవుడి నుంచి ఓ వినూత్నమైన వరం పొందిన ఓ యువకుడి ప్రేమ కథలో చోటు చేసుకునే చిత్రవిచిత్రమైన ట్విస్టుల సమాహారంగా రూపొందిన "బ్రహ్మ రాసిన కథ.  చిత్రాన్ని తమ దర్శకుడు నవీన్ సంకు అద్భుతంగా తెరకెక్కించాడని, దర్శకుడిగా అతనికి ఉజ్వల భవిష్యత్ ఉందని సింధు నాయుడు పేర్కొన్నారు. హీరోహీరోయిన్లు లారెన్స్ నరేష్-శ్రీలయలకు కూడా చాలా మంచి పేరు వస్తుందని, ఇద్దరూ పోటాపోటీగా నటించారని ఆమె అన్నారు. 
 
 
వంశీ, కల్యాణి, భార్గవ్ నాయక్, రితిక దేశ్ ముఖ్, లక్షిత, సుధీర్ కె.వంశీ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పాటలు: భువనేశ్వర్ రాగఫణి, సంగీతం: సన్నీ సకురు, ఎడిటింగ్ & డిఐ: జగ సి.హెచ్, బ్యానర్: ఓ రేంజ్ ప్రొడక్షన్స్, నిర్మాత: సింధునాయుడు, రచన-దర్శకత్వం: నవీన్ సంకు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments