Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి బై పోల్ ఎఫెక్ట్ .. నరంలేని నాలుక... అమరావతిపై మాట మార్చిన వీర్రాజు!

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (15:56 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట మార్చారు. నిన్నామొన్నటివరకు మూడు రాజధానుల అంశంపై నోరు మెదపని ఆయన ఇపుడు పల్టీ కొట్టారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. ఏపీలో ఖాళీగా ఉన్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక జరుగనుంది. ఇక్కడ నుంచి పోటీ చేయాలని పరితపిస్తున్న ఏపీ బీజేపీ శాఖ ఇపుడు రాజధాని అమరావతి అంశంపై క్లారిటీ ఇచ్చింది. 
 
ముఖ్యంగా, ఒక రాష్ట్ర రాజధాని అంశంలో తమకుగానీ, కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వానికిగాని ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వచ్చిన రాష్ట్ర బీజేపీ నేతలు ఇపుడు మాట మార్చారు. ఏపీకి ఒక్క రాజధానే ఉండాలని, అదీకూడా అమరావతిగా ఉండాలని ప్రకటించారు. పైగా, తమ పార్టీ మూడు రాజధానులకు వ్యతిరేకమని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు సెలవిచ్చారు. 
 
నిజానికి అమరావతి అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అధికార వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా బీజేపీ వైఖరి ఏమిటో ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టతనిచ్చారు. 
 
రాజధాని అమరావతిలోనే ఉండాలనేది బీజేపీ లక్ష్యమన్నారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇందులో రెండో ఆలోచనకు తావు లేదని పునరుద్ఘాటించారు. తుళ్లూరులో జరిగిన భారతీయ కిసాన్ సంఘ్ సమ్మేళన్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతినిధిగా తాను మాట్లాడుతున్నానని సోము వీర్రాజు ప్రకటించారు. అమరావతిలో రూ.1800 కోట్లతో నిర్మిస్తున్న ఎయిమ్స్ ఆసుపత్రి ఆగలేదని, దుర్గమ్మ ఫ్లైఓవర్‌ను పూర్తి చేశామని... మోడీ అమరావతి వైపే ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. 
 
ఏపీ బీజేపీ కార్యాలయాన్ని కూడా విజయవాడలోనే కడుతున్నామని చెప్పారు. బీజేపీ మాట తప్పే పార్టీ కాదని అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ తరపున ఉద్యమం చేస్తామని చెప్పారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి అధికారాన్ని అందిస్తే... అమరావతిని మరింత అభివృద్ది చేస్తామని సోము వీర్రాజు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments