Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ పోవాలి బిజెపి రావాలి, ఇదే మా నినాదం: సోము వీర్రాజు

జగన్ పోవాలి బిజెపి రావాలి, ఇదే మా నినాదం: సోము వీర్రాజు
, శనివారం, 12 డిశెంబరు 2020 (18:12 IST)
తిరుపతిలో మొట్టమొదటి బిజెపి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి ముఖ్యనేతలందరూ పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఉప ఎన్నికల్లో జగన్ పోవాలి.. బిజెపి రావాలన్న నినాదంతో సమావేశాన్ని నిర్వహించారు.
 
ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, శేషాచలం కొండల్లో విలువైన ఎర్రచందనాన్ని దోచేస్తున్నా రాష్ట్రప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం హిందూత్వాన్ని మంటగలుపుతోందని.. వైసిపి నేతలే దేవాలయ భూములను ఆక్రమించేస్తున్నారన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం గాలేరు.. నగరి ప్రాజెక్టును తీసుకొస్తే ఆ ప్రాజెక్టును గాలికొదిలేశారన్నారు. 
 
నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు చారిత్రాత్మకమన్నారు బిజెపి జాతీయ కార్యదర్సి సత్యకుమార్. కాంగ్రెస్ పార్టీ కొంతమంది రైతులను రెచ్చగొట్టి రాద్దాంతం చేయిస్తోందన్నారు. బిజెపిపై అసత్య ప్రచారాలు మానాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేదల పెన్నిధి, రైతుల పక్షపాతి అన్నారు సత్యకుమార్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాలరీల్లో కోత.. విస్ట్రన్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ వర్కర్ల ఆవేశం.. చితక్కొట్టారు..