Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంతవాళ్లు కూడా నేను ఓడిపోవాలని కోరుకుంటున్నారు : ఎమ్మెల్యే రాజాసింగ్

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (16:05 IST)
తెలంగాణ రాష్ట్రంలోని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత పార్టీ నేతలు సైతం వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోవాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. అందువల్ల వచ్చే ఎన్నికల తర్వాత అసెంబ్లీలో తాను ఉండకపోవచ్చని తెలిపారు. ఎన్నికల్లో తన ఓటమిని కోరుకునే వారి సంఖ్య పెరిగిపోయిందని చెప్పారు. ఇతర పార్టీల నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా తాను ఓడిపోవాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణాలో ఏర్పడే ప్రభుత్వం ఆశీస్సులు తన నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్టు రాజాసింగ్ చెప్పారు. ఈయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 
 
జంట నగరాల్లో రాజా సింగ్‌కు బీజేపీ శ్రేణుల్లో మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే, గత యేడాడి ఆయన మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. దీంతో బీజేపీ పెద్దలు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ నుంచి తొలగించింది. శాసనసభాపక్ష నేతల పదవి నుంచి తప్పించింది. ఈ వ్యాఖ్యలపై కేసు నమోదు కావడంతో రాజా సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న రాజా సింగ్ తాజాగా అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments