Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దు.. సోము వీర్రాజు - నేడు షాతో భేటీ

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (08:29 IST)
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దని భారతీయ జనతా పార్టీ నేతలు కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు సోమవారం కేంద్రహోం మంత్రి అమిత్ షాతో భేటీకానున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అధికార వ్యవస్థ ప్రభుత్వానికి తాబేదార్లుగా మారిపోయిందని దుయ్యబట్టారు. విద్య, ఆరోగ్యాన్ని వదిలేసి రాజధానిపై అనవసర చర్చ జరుగుతోందని సోమువీర్రాజు తప్పుబట్టారు. 
 
అలాగే, స్టీల్‌ప్లాంట్‌ను కారు చౌకగా అమ్మటానికి వీల్లేదన్నారు. కాగా, సోమవారం ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలను కలుసుకోనున్నారు. ప్రైవేటీకరణ, తిరుపతి ఉపఎన్నికపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీకి పెరిగిన ఓట్ల శాతం, పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments