Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దు.. సోము వీర్రాజు - నేడు షాతో భేటీ

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (08:29 IST)
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దని భారతీయ జనతా పార్టీ నేతలు కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు సోమవారం కేంద్రహోం మంత్రి అమిత్ షాతో భేటీకానున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అధికార వ్యవస్థ ప్రభుత్వానికి తాబేదార్లుగా మారిపోయిందని దుయ్యబట్టారు. విద్య, ఆరోగ్యాన్ని వదిలేసి రాజధానిపై అనవసర చర్చ జరుగుతోందని సోమువీర్రాజు తప్పుబట్టారు. 
 
అలాగే, స్టీల్‌ప్లాంట్‌ను కారు చౌకగా అమ్మటానికి వీల్లేదన్నారు. కాగా, సోమవారం ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలను కలుసుకోనున్నారు. ప్రైవేటీకరణ, తిరుపతి ఉపఎన్నికపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీకి పెరిగిన ఓట్ల శాతం, పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments