Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అరకు లోయలో పడిన బస్సు : 8 మంది మృతి.. సీఎం జగన్ దిగ్భ్రాంతి

అరకు లోయలో పడిన బస్సు : 8 మంది మృతి.. సీఎం జగన్ దిగ్భ్రాంతి
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (22:37 IST)
Araku
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అరకు లోయలో పడిపోయిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. హైదరాబాద్ షేక్ పేట ప్రాంతానికి చెందిన వారు ఇవాళ ఉదయమే విశాఖపట్టణం వచ్చి అరకు లోయ విహార యాత్ర చేస్తుండగా ప్రమాదానికి గురికావడం.. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది
 
ఒకవైపు ప్రమాద స్థలి అంతా మరుభూమిని మరిపిస్తుంటే.. నేతల ఆరాలతో అందరి దృష్టి అరకుపైనే కేంద్రీకృతమైంది. అంతా చీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు వస్తున్న వార్తలు అయ్యో పాపం.. అనే నిట్టూర్పులతో జనం అంతా టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఆరాతీశారు. చీకట్లో గాయపడినవారి ఆర్తనాదాల గురించి వింటూ నిట్టూర్పులు విడవడంతో విషాదవాతావరణం ఏర్పడింది.
 
విశాఖ జిల్లా అనంతగిరి ఘాట్‌రోడ్డులో డముకు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైయస్‌.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాద ఘటనపై సీఎంఓ అధికారులతో ఆరా తీశారు. జరుగుతున్న సహాయక చర్యల వివరాలను అడిగితెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Disease Xతో ముప్పు.. ఐదేళ్లకు ఓసారి విజృంభించే ఛాన్స్!