Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా ముగ్గురు ఎంపీలు భాజపాలోకి జంప్...? ఆ ఎంపితో బాబు ఏకాంతంగా.. ఎందుకు?

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (10:14 IST)
తెలుగుదేశం పార్టీ ఎపిలో గెలుచుకుంది మూడు ఎంపి సీట్లే. పార్టీ అసలు ఉంటుందా అన్న అనుమానం ఆ పార్టీ నేతల్లోనే కలిగింది. కానీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కేడర్‌కు నచ్చజెప్పి ఎవరూ అధైర్యడొద్దండి అంటూ చెప్పారు. ప్రస్తుతానికి అది బాగానే ఉన్నా టిడిపిలో వలసలు ప్రారంభమైనట్లు స్పష్టంగా కనబడుతోందంటున్నారు విశ్లేషకులు. టిడిపి విజయవాడ ఎంపిగా గెలిచిన కేశినేని నాని బిజెపి నేతలతో బాగా టచ్‌లో ఉన్నారు. అంతేకాదు బిజెపిలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు.
 
టిడిపిలో నిన్న విప్ పదవి ఇస్తే వద్దని సున్నితంగా తిరస్కరించారు కేశినేని నాని. ఇది కాస్తా రాజకీయంగా పెద్ద చర్చే జరిగింది. ఎంపి గల్లా జయదేవ్ మధ్యవర్తిత్వంతో చివరకు చర్చలకు కూర్చున్నారు. మరోవైపు చంద్రబాబు ఏకాంతంగా కేశినేని నానితో మాట్లాడారు. గంట పాటు వీరిద్దరి మధ్య చర్చ కూడా జరిగింది. పార్టీ ఇచ్చిన పదవిని తీసుకోవాలని చంద్రబాబు కేశినేని నానికి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే నాని మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయారట. 
 
దీంతో చంద్రబాబు కూడా సైలెంట్ అయిపోయారట. మరోవైపు బిజెపి నేతలతో బాగా టచ్‌లో ఉన్నారట  కేశినేని నాని. టిడిపిలో ఉన్న ముగ్గురు ఎంపిలను తమవైపు తిప్పుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది బిజెపి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments