Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రత్యేక ఇవ్వకపోవడం వల్లే నష్టపోయాం : రాంమాధవ్

ప్రత్యేక ఇవ్వకపోవడం వల్లే నష్టపోయాం : రాంమాధవ్
, గురువారం, 6 జూన్ 2019 (08:11 IST)
విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వక పోవడం వల్ల సీమాంధ్ర ఓటర్లు తమను తిరస్కరించారని బీజేపీ సీనియర్ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అభిప్రాయపడ్డారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లే తాము ఏపీలో నష్టపోయామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల తాము ఆంధ్రాలోనే కాదని తెలంగాణలో కూడా దెబ్బతిన్నామన్నారు. ముఖ్యంగా, సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో తాము గెలిచిన స్థానాల్లో నివశించే సీమాంద్రకు చెందిన సెటిలర్స్ ఓట్లు బీజేపీకి పడలేదన్నారు. 
 
సెటిలర్స్ కూడా ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లే బీజేపీకి దూరమయ్యారని ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు మళ్లాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ మోసం చేసిందని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేశారని, రాజకీయ ఉద్దేశంతో తమపై చేసిన దుష్ప్రచారం తమకు బాగానే నష్టాన్ని కలిగించిందన్నారు. 
 
ఇకపోతే ఆధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సైతం ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ప్రత్యేక హోదాపై చర్చించారని ఆయన గుర్తుచేశారు. ప్రధాని దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సలహాల మేరకు ఆనాడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి... మోహన్ బాబు అలా చెప్పగానే...