Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న ప్రధాని మోదీ...

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (10:07 IST)
భారత ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ తొలిసారిగా తిరుమలకు రానున్నారు. ఈ నెల 9న సాయంత్రం 4 గంటలకు మోడీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమలకు బయలుదేరుతారు. తిరుమల కొండపైకి చేరుకున్నాక మోడీ పద్మావతి అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. 
 
అక్కడి నుంచి నేరుగా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు రేణిగుంట నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. 
ప్రధాని పర్యటన ఖరారు కావడంతో రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు ఏర్పాట్లు ప్రారంభించాయి. ప్రధాని పర్యటన ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. 
 
మరోవైపు మోడీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఏపీ బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఢిల్లీలో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ వి. మురళీధరన్ నివాసంలో రాష్ట్రనేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్షీ నారాయణ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు ఈ భేటీలో పాల్గొని ప్రధాని తిరుమల పర్యటన, ఇతర అంశాలపై చర్చించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments