తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న ప్రధాని మోదీ...

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (10:07 IST)
భారత ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ తొలిసారిగా తిరుమలకు రానున్నారు. ఈ నెల 9న సాయంత్రం 4 గంటలకు మోడీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమలకు బయలుదేరుతారు. తిరుమల కొండపైకి చేరుకున్నాక మోడీ పద్మావతి అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. 
 
అక్కడి నుంచి నేరుగా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు రేణిగుంట నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. 
ప్రధాని పర్యటన ఖరారు కావడంతో రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు ఏర్పాట్లు ప్రారంభించాయి. ప్రధాని పర్యటన ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. 
 
మరోవైపు మోడీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఏపీ బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఢిల్లీలో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ వి. మురళీధరన్ నివాసంలో రాష్ట్రనేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్షీ నారాయణ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు ఈ భేటీలో పాల్గొని ప్రధాని తిరుమల పర్యటన, ఇతర అంశాలపై చర్చించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

Ravi Teja: రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, యాక్షన్ తో విడుదలైన మాస్ జతర ట్రైలర్

Bigg Boss Telugu 9 : పక్కటెముకల్లో గాయం.. రెస్టు కోసం బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments