Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిరెడ్డికి ఊరట... భత్యం తీసుకోని జోడు పదవుల్లో ఉంటే తప్పులేదు...

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (09:18 IST)
జోడు పదవులను అనుభవిస్తున్న వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ సీహెచ్ రామకోటయ్య అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఎలాంటి జీతభత్యాలు తీసుకోకుండా రెండు పదవుల్లో కొనసాగడంలో తప్పులేదని పేర్కొంది. అందువల్ల విజయసాయి రెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ సీహెచ్ రామకోటయ్య చేసిన ఫిర్యాదు చెల్లబోదంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగానూ జోడు పదవులను అనుభవిస్తున్న విషయం తెల్సిందే. దీనిపై టీడీపీ నేత సీహెచ్ రామకోటయ్య రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి.. విజయసాయిని అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. 
 
ఇదే ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన రాష్ట్రపతి, సలహా కోరగా, పార్లమెంట్ అనర్హత నిరోధక చట్టం 1959 ప్రకారం, ప్రత్యేక ప్రతినిధిగా ఎటువంటి వేతనం, భత్యం తీసుకోని విజయసాయిపై, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద చర్యలు తీసుకునే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. దీంతో ఆయనపై అనర్హత వేటు చెల్లబోదని రాష్ట్రపతి పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments