Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిరెడ్డికి ఊరట... భత్యం తీసుకోని జోడు పదవుల్లో ఉంటే తప్పులేదు...

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (09:18 IST)
జోడు పదవులను అనుభవిస్తున్న వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ సీహెచ్ రామకోటయ్య అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఎలాంటి జీతభత్యాలు తీసుకోకుండా రెండు పదవుల్లో కొనసాగడంలో తప్పులేదని పేర్కొంది. అందువల్ల విజయసాయి రెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ సీహెచ్ రామకోటయ్య చేసిన ఫిర్యాదు చెల్లబోదంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగానూ జోడు పదవులను అనుభవిస్తున్న విషయం తెల్సిందే. దీనిపై టీడీపీ నేత సీహెచ్ రామకోటయ్య రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి.. విజయసాయిని అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. 
 
ఇదే ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన రాష్ట్రపతి, సలహా కోరగా, పార్లమెంట్ అనర్హత నిరోధక చట్టం 1959 ప్రకారం, ప్రత్యేక ప్రతినిధిగా ఎటువంటి వేతనం, భత్యం తీసుకోని విజయసాయిపై, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద చర్యలు తీసుకునే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. దీంతో ఆయనపై అనర్హత వేటు చెల్లబోదని రాష్ట్రపతి పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments