Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొడవపడి తిట్టుకున్న ప్రేమికులు... బలవన్మరణానికి పాల్పడిన ప్రియుడు!!

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (09:11 IST)
ఒకరినొకరు ఇష్టపడి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న ప్రేమికులు చిన్నపాటి విషయాలకే గొడవలు పడుతున్నారు. ఈ గొడవలు చివరకు ప్రాణాలు హరించేంతవరకు పోతున్నాయి. తాజాగా చిన్నపాటి విషయానికే ఓ ప్రేమజంట గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ప్రియురాలు కూడా మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన విశాఖపట్టణం జిల్లా మధురవాడలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని వైఎస్సార్ నగర్ కాలనీలో బ్లాక్ నంబర్ 13లో నివసించే అరుణ్ కుమార్ (23) ఓ ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో పనిలేక ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్న అరుణ్ అదే కాలనీకి చెందిన అనితను ప్రేమిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఉపాధిలేక ఇంటిపట్టునే ఉన్న అరుణ్.. తన ప్రియురాలిని కలిసేందుకు సోమవారం ఆమె వద్దకు వెళ్లాడు. అపుడు వారిమధ్య చిన్నపాటి గొడవ జరిగింది. 
 
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అరుణ్ కుమార్ ఇంట్లోని ప్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన అనిత తానుంటున్న భవనం మూడో అంతస్తు నుంచి కిందికి దూకేసి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఇరుగుపొరుగు వారు తీవ్రంగా గాయపడిన అనితను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments