పెన్షన్ టెన్షన్.. సచివాలయ మెట్లపైనే పోయిన ప్రాణం

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (08:57 IST)
ఏపీలోని బాపట్ల జిల్లాలో పెన్షన్ టెన్షన్ మరో ప్రాణాన్ని బలితీసుకుంది. వృద్ధాప్య పింఛను తీసుకునేందుకు గ్రామ సచివాలయానికి వెళ్లిన ఆయనకు.. పింఛన్ వస్తుందో రాదో అన్న భయంతో మెట్లపైనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన గురువారం చోటు చేసుకుంది. 
 
బాపట్ల జిల్లా నగరం మండలం అద్దంకివారి పాళెంకు చెందిన మస్తాన్ రావు (78) అనే వృద్ధుడికి వలంటీరు ఈ నెల ఒకటో తేదీన పింఛను ఇవ్వలేదు. పైగా, వలంటీరు ఇంటికి రాకపోవడంతో విసుగు చెందిన వృద్ధుడు సచివాలయానికి వెళ్లాడు. 
 
వేలిముద్రలను యంత్రం తీసుకోవడం లేదని, ధ్రువపత్రాలతో రావాలని అక్కడి అధికారులు ఆయనకు సూచించారు. అలా ఒకటికి మూడు సార్లు ఇంటికి, కార్యాలయానికి తిరిగిన వృద్ధుడు సచివాలయం మెట్లెక్కుతూ కుప్పకూలారు. 
 
అధికారులు 108కి సమాచారమివ్వగా సిబ్బంది వచ్చి పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన తండ్రి చనిపోయారని కుమారుడు వెంకటేశ్వరరావు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

Mohan Babu: డా. ఎం. మోహన్ బాబు కి MB50 - ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్ గ్రాండ్ ఈవెంట్

Sudheer Babu:.నటుడిగా నేను విజయం సాధిస్తానా? ప్రేక్షకులు నన్ను అంగీకరిస్తారా? నాకు భయంగా ఉంది: సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments