Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు హిందూ మతమంటే నచ్చదు : శ్రీనివాసానంద సరస్వతి

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (08:37 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి హిందూమతమంటే ఏమాత్రం నచ్చదని అందుకే ఆయన ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరుకాలేదని ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. 
 
ఇదే విషయంపై ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. హిందూమత సంప్రదాయాలను గౌరవించడం, హిందూ దేవాలయాలకు వెళ్లడం క్రైస్తవమత భావాలు కలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి, ఆయన కుటుంబానికి ఏ మాత్రం ఇష్టం ఉండదని ఆంధ్రప్రదేశ్‌ సాధుపరిషత్తు అధ్యక్షుడైన శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. 
 
కడప జిల్లాలోని ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించాల్సి ఉన్నప్పటికీ కాలు బెణికిందనే నెపంతో వెళ్లకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆ తర్వాత రోజు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పార్టీ కార్యక్రమానికి ఎలా హాజరయ్యారని ప్రశ్నించారు. 
 
ఈ ముఖ్యమంత్రి గత నాలుగేళ్ళలో ఒక్కసారైనా సీతారాముల కల్యాణానికిగాని, తిరుమలలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకుగానీ భార్యతో కలిసి వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించారా? అని ప్రశ్నించారు. పేరుకే హిందువు అని చెప్పుకునే సీఎం జగన్.. పక్కా క్రైస్తవ వాది అన్నారు. w

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments