రాజధాని అమరావతి గ్రామాల్లో బంద్ .. మా పోరాటం ఆగదంటున్న రైతులు

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (10:55 IST)
రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో బంద్‌ కొనసాగుతోంది. రైతులు, మహిళలపై సోమవారం అసెంబ్లీ ముట్టడి సందర్భంగా పోలీసుల లాఠీచార్జికి నిరసనగా అమరావతి పరిరక్షణ సమితి రాజధాని గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చింది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు.
 
మంచినీరు సహా ఏ పదార్థాలు పోలీసులకు విక్రయించరాదని నిర్ణయించుకున్నట్లు వ్యాపారులు తెలిపారు. పోలీసులు అడ్డుకుంటే జాతీయ జెండాలతో నిరసనలు తెలపాలని రాజధాని రైతులు నిర్ణయించారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజా సంఘాలు, రాజకీయపక్షాలు ఆందోళనలు చేపట్టాయి.
 
మా పోరాటం ఆగదు: రైతులు 
మూడు రాజధానులకు అసెంబ్లీలో ప్రభుత్వం ఆమోదం తెలపడంపై రాజధాని గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మందడంలో ఉదయం నుంచి రైతుల నిరసనకు దిగారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన తమ పోరాటం ఆగదని రైతులు స్పష్టం చేశారు. సీఆర్డీఏకు నిన్న మధ్యాహ్నం వరకు అభిప్రాయాలు తెలిపే అవకాశం కోర్టు ఇచ్చిందని... కోర్టు తీర్పునకు విరుద్ధంగా గడువు కంటే ముందే మంత్రి వర్గం ఎలా ఆమోదిస్తుందని ప్రశ్నించారు. గడువుకంటే ముందే బిల్లును అసెంబ్లీలో ఎలా ప్రవేశపెడతారని రైతులు నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments