Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు- రూ.2.27 లక్షల నగదు గోవిందా

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (11:07 IST)
ATM
ఏటీఎం యంత్రాన్ని మినీ డీసీఎంలో దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన పటాన్‌చెరు రుద్రారంలో జరిగింది. ఇండీక్యాష్‌ ఏటీఎంలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఎంటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లారు.

స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నరేష్‌ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. అపహరణ సమయానికి ఏటీఎంలో రూ.2.27 లక్షలు ఉన్నట్టు ఇండీక్యాష్‌ ప్రతినిధులు తెలిపారు. 
 
పోలీసులు క్లూస్‌ బృందాన్ని రప్పించి వివరాలు సేకరించారు. అర్ధరాత్రి ఒంటిగంట దాటాక ఘటన చోటు చేసుకున్నట్టు నిర్ధారణకు వచ్చారు. దుండగులు చోరీకి ముందు సీసీ కెమెరాల తీగలు కత్తిరించారు. అక్కడికి సమీపంలో ఓ టిఫిన్‌ సెంటర్‌లో ఉన్న సీసీ కెమెరాల పుటీజీ ఆధారంగా విచారణ చేపట్టారు. 
 
ఐదుగురు వ్యక్తులు ఏటీఎంను పెకిలించి మినీ డీసీఎంలో తరలించినట్టు భావిస్తున్నారు. ఇదే ఏటీఎంలో గతంలోనూ రెండు సార్లు చోరీయత్నం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments