Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రంతా నిద్రపోనివ్వలేదు ... వస్తువులు ధ్వంసం చేశారు : అచ్చెన్న భార్య

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (12:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయంలో రూ.150 కోట్ల ఈఎస్ఐ స్కామ్ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఏసీబీ విచారణ జరుపుతోంది. ఈ కేసులో శుక్రవారం వేకువజామున టీడీపీకి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అయితే, అరెస్టుకు ముందు ఏం జరిగిందో అచ్చెన్నాయుడు భార్య విజయ మాధూరి మీడియాకు వివరించారు. 
 
గురువారం రాత్రి 7.30 గంటలకే తమ ఇంటిని చుట్టుముట్టిన కొందరు, తాము ఏసీబీ అధికారులమంటూ ఇంట్లోకి వచ్చారని, తమకు ఏం జరుగుతోందో అర్థంకాని పరిస్థితుల్లోనే రాత్రంగా గడచిపోయిందన్నారు. 
 
పైగా, తన భర్తకు ఇటీవలే సర్జరీ జరిగిందన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. రాత్రంతా తన భర్తను నిద్రపోనివ్వలేదని, ఇల్లంతా సోదాలు చేశారని, కొన్ని వస్తువులను నాశనం చేశారని ఆమె ఆరోపించారు. 
 
అర్థరాత్రి తర్వాత ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టు అధికారులు చెప్పారని, ఆపై తామెంత చెప్పినా వినకుండా తీసుకెళ్లిపోయారని అన్నారు. తన భర్తకు ఏదైనా ఆపద సంభవిస్తే, ప్రభుత్వానిదే బాధ్యతని అని ఆమె హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments