Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశోక్‌ గజపతిరాజు పలు కీలక నిర్ణయాలు

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (23:06 IST)
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పూసపాటి అశోక్‌ గజపతిరాజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాన్సాస్ ట్రస్టు కార్యకలాపాల వివరాలు ఇవ్వాలని ట్రస్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు అశోక్ గజపతిరాజు ఆదేశాలు జారీ చేశారు.
పదేళ్లుగా ఆడిటింగ్‌కు చెల్లించిన ఫీజు వివరాలు ఇవ్వాలన్నారు.
 
ట్రస్టు భూముల్లో ఇసుక తవ్వకాలకు ఎవరు అనుమతించారో తెలపాలి గజపతిరాజు అన్నారు. మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతిరాజు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

మాన్సాస్ ట్రస్టు కార్యకలాపాలపై పదేళ్లుగా ఆడిటింగ్ జరగలేదన్న ఆరోపణల దృష్ట్యా.. ఆడిట్ కోసం చెల్లించిన ఫీజు వివరాలను ఈ నెల 21వ తేదీలోగా అందజేయాలని అధికారులను ఆదేశించారు.

తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లిలోని మాన్సాస్ ట్రస్టు భూముల్లో ఇసుక తవ్వకాల అనుమతులపై నివేదిక ఇవ్వాలని అశోక్ గజపతిరాజు అన్నారు. 
 
విద్యాసంస్థల బడ్జెట్ ప్రతిపాదనలను వారంలో తయారు చేయాలని, సిబ్బంది జీతాలకు చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.

గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 5లక్షల రూపాయలు దాటిన కార్యాలయ కొనుగోళ్లకు వివరాలను రెండు రోజుల్లో అందించాలని ట్రస్టు ఛైర్మన్ సూచించారు.

లీజు గడువు పూర్తయిన ట్రస్టు భూములకు వెంటనే వేలం నిర్వహించాలంటూ.. ట్రస్ట్ కార్యాలయ అధికారులకు అశోక్‌ గజపతి ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments