Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటర్ పరీక్షలు రద్దుకు ఏపీకి సుప్రీంకోర్టు నోటీసులు: నచ్చచెపుతామంటున్న ఆదిమూలపు

Advertiesment
ఇంటర్ పరీక్షలు రద్దుకు ఏపీకి సుప్రీంకోర్టు నోటీసులు: నచ్చచెపుతామంటున్న ఆదిమూలపు
, గురువారం, 17 జూన్ 2021 (16:08 IST)
కరోనా నేపధ్యంలో దేశంలోని 28 రాష్ట్రాలకు గాను 18 రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలను రద్దు చేసాయి ఆయా ప్రభుత్వాలు. కానీ ఏపీతో సహా మరో మూడు రాష్ట్రాలు మాత్రం కరోనా వున్నప్పటికీ విద్యార్థులకు పరీక్షలు పెట్టి తీరుతామని భీష్మించుకు కూర్చున్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో చర్చ జరిగింది.
 
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని అనుసరించి ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు వున్నదనీ, ఇప్పటివరకూ విద్యార్థులకు కనీసం టీకాలు కూడా వేయలేదని న్యాయకోవిదులు అభిప్రాయపడ్డారు. ఈ నేపధ్యంలో పరీక్షలు పెట్టాల్సిందేనంటూ భీష్మించుకుని కూర్చున్న ఏపీ, పంజాబ్‌, త్రిపుర, అస్సాం రాష్ట్రాలకు పరీక్షల రద్దుకు సుప్రీం నోటీసులు ఇచ్చింది.
 
దీనిపై ఏపీ విద్యాశాఖమంత్రి స్పందిస్తూ.. విద్యార్థుల భవితవ్యం బాగుండాలని తాము పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నామనీ, ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు నచ్చజెపుతామని అన్నారు. ఏం జరుగుతుందో చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సప్ నుంచి కొత్తగా ఐదు ఫీచర్స్.. రీడ్ లేటర్.. వ్యూవ్ ఒన్స్ గురించి తెలుసా?