Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (20:54 IST)
ఎపిలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 16వ తేది నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎపి వ్యాప్తంగా 3,87,983 మంది ప్రభుత్వ, ప్రయివేటు వైద్యారోగ్య సిబ్బందికి తొలి విడతలో వ్యాక్సిన్‌ అందించనున్నారు.

ఇందుకోసం రాష్ట్రంలో 1,940 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐస్‌లైన్డ్‌ రిఫ్రిజిరేటర్లు, వాక్‌ ఇన్‌ ఫ్రీజర్‌ గదుల ఏర్పాటు కారణంగా 1,659 చోట్ల వ్యాక్సిన్‌ వయల్స్‌ కార్టన్లను వైద్య ఆరోగ్య శాఖ భద్రపరిచింది. ప్రతి కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్‌ వేసేలా ప్రణాళిక రూపొందించారు. వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

వ్యాక్సినేషన్‌ కోసం వచ్చే సిబ్బందికి ముందుగానే కొవిన్‌ యాప్‌ ద్వారా సంక్షిప్త సమాచారం అందుతుంది. వైద్య సిబ్బది గుర్తింపు కార్డులు వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వ్యాక్సిన్‌ ప్రక్రియను కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షించనున్నారు. ప్రతి వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద అత్యవసర వైద్య సిబ్బందిని నియమించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments