Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీపురుషులను ఒకే గదిలో నిర్బంధిస్తారా? చంద్రబాబు ఫైర్

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (19:58 IST)
ఓ వైసీపీనేత ఫిర్యాదు చేశాడని కృష్ణా జిల్లా జగ్గయ్య పేట మండలం జయంతిపురం గ్రామానికి చెందిన భూక్యా కుటుంబీకులను ఏడేళ్ల చిన్నారితో సహా చిల్లకల్లు పోలీసు స్టేషన్‌కు తెచ్చి నిర్బంధించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. కొంతమంది పోలీసులు తాము అమలు చేయాల్సిన చట్టాలను వదిలేసి వైసీపీ నేతల మాటే చట్టంగా వ్యవహరించడం దారుణమని తెలిపారు.
 
ఈ సందర్భంగా భూక్యా కుటుంబ సభ్యులు పీఎస్‌లో ఓ గదిలో ఉన్న ఫోటోలను చంద్రబాబు షేర్ చేశారు. ఆ గదిలో చిన్నారి కూడా ఉండటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిన్నారిలో మీకు ఏ నేరస్తుడు కనిపించాడు? స్త్రీ పురుషులను ఒకే గదిలో నిర్భంధించమని ఏ చట్టం చెబుతుందని మండిపడ్డారు.
 
కోవిడ్ నిబంధనలు పేరిట టీడీపీ వాళ్లను ఇబ్బంది పెట్టే మీకు ఇలా గుంపుగా అందరినీ ఒకచోట నిర్బంధించడానికి ఏ వైసీపీ చట్టం అనుమతించిందని ప్రశ్నించారు. కోర్టులు వేలెత్తి చూపినా మీ తీరు మారదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments