ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆ బస్సు నో ఎంట్రీ!

ఠాగూర్
సోమవారం, 11 ఆగస్టు 2025 (16:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పించనుంది. స్త్రీ శక్తి పేరుతో ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించబోతుంది. తాజాగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణా శాఖ ముఖ్య కార్యద్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. 
 
ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఐదు కేటగిరీల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినదరీ, పల్లె వెలుగు, అల్ట్రా వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని పేర్కొంది. 
 
మహిళలు, బాలికలు, హిజ్రాలు తగిన గుర్తింపు కార్డులు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. తిరుపతి - తిరుమల మధ్య తిరిగే సప్తగిరి బస్సులో కూడా ఈ ఉచిత ప్రయాణం వర్తించదు. నాన్ స్టాఫ్, ఇతర రాష్ట్రాలకు తిరిగే అంతర్రాష్ట్ర సర్వీసుల్లో కూడా ఉచితం వర్తించదు. 
 
సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. అన్ని బస్సులో సీసీ టీవీ కెమెలారు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కండక్టర్లకు బాడీ వోర్న్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments