Webdunia - Bharat's app for daily news and videos

Install App

23న గౌతం రెడ్డి అంత్యక్రియలు - అపోలో వైద్యులు స్టేట్మెంట్ రిలీజ్

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (14:23 IST)
తీవ్రమైన గుండెపోటుతో సోమవారం హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలు బుధవారం జరుగనున్నాయి. అదేసమయంలో ఆయన మృతికి సంతాపసూచకంగా ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. 
 
ప్రస్తుతం గౌతం రెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ రాజకీయ నేతలు, అభిమానుల సందర్శనార్థం సోమవారం సాయంత్రం వరకు ఉంచుతారు. ఆ తర్వాత గౌతం రెడ్డి మృతదేహాన్ని నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామమైన మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లికి తీసుకొస్తారు. 
 
అయితే, గౌతంరెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి అమెరికాలో ఉన్నారు. ఆయన మంగళవారం సాయంత్రానికి స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అంటే బుధవారం ఏపీ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో గౌతం రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తారు. 
 
ఇదిలావుంటే గౌతం రెడ్డి మరణంపై హైదరాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటి వద్ద గౌతం రెడ్డి కుప్పకూలారని, ఉదయం 7.45 గంటలకు అపోలో ఆస్పత్రికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. 
 
స్పందించని స్థిలో ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చారని, అప్పటికే ఆయనకు శ్వాస ఆడటం లేదని చెప్పారు. ఐసీయులో వైద్య బృందం తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఉదయం 9.16 గంటలకు ఆయన కన్నుమూశారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments