Webdunia - Bharat's app for daily news and videos

Install App

23న గౌతం రెడ్డి అంత్యక్రియలు - అపోలో వైద్యులు స్టేట్మెంట్ రిలీజ్

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (14:23 IST)
తీవ్రమైన గుండెపోటుతో సోమవారం హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలు బుధవారం జరుగనున్నాయి. అదేసమయంలో ఆయన మృతికి సంతాపసూచకంగా ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. 
 
ప్రస్తుతం గౌతం రెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ రాజకీయ నేతలు, అభిమానుల సందర్శనార్థం సోమవారం సాయంత్రం వరకు ఉంచుతారు. ఆ తర్వాత గౌతం రెడ్డి మృతదేహాన్ని నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామమైన మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లికి తీసుకొస్తారు. 
 
అయితే, గౌతంరెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి అమెరికాలో ఉన్నారు. ఆయన మంగళవారం సాయంత్రానికి స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అంటే బుధవారం ఏపీ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో గౌతం రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తారు. 
 
ఇదిలావుంటే గౌతం రెడ్డి మరణంపై హైదరాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటి వద్ద గౌతం రెడ్డి కుప్పకూలారని, ఉదయం 7.45 గంటలకు అపోలో ఆస్పత్రికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. 
 
స్పందించని స్థిలో ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చారని, అప్పటికే ఆయనకు శ్వాస ఆడటం లేదని చెప్పారు. ఐసీయులో వైద్య బృందం తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఉదయం 9.16 గంటలకు ఆయన కన్నుమూశారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments