Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 25 జిల్లాల ఏర్పాటు దిశగా సీఎం జగన్ అడుగులు??

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (08:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో తమ పార్టీ తరపున ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్రంలో 25 జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం 13 జిల్లాలను ఒక్కో లోక్‌సభ స్థానాన్ని ఒక్కో జిల్లాగా చేస్తూ మొత్తం 25 జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై ఆయన 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
 
ఒక్కో లోక్‌సభను ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయడం వల్ల పరిపాలన మరింత సులభతరంగా ఉంటుందనీ, పైగా, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్క కుటుంబానికి చేరవేసేందుకు సులభంగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ జిల్లాల కలెక్టర్లతో వ్యాఖ్యానించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు త్వరలోనే 25 జిల్లాలుగా మారనున్నాయి. ఆ ప్రకారంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్న తిరుపతి పట్టణం చిత్తూరు జిల్లా నుంచి విడిపోయి జిల్లా కేంద్రంగా ఏర్పాటుకానుంది. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments