Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ సర్కారుపై ధిక్కార పిటిషన్ దాఖలు చేయనున్న రమేష్ కుమార్!?

జగన్ సర్కారుపై ధిక్కార పిటిషన్ దాఖలు చేయనున్న రమేష్ కుమార్!?
, సోమవారం, 22 జూన్ 2020 (15:04 IST)
ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా తన పదవీకాలాన్ని కుదించి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి బాధ్యతల నుంచి తప్పించిన ఏపీ సర్కారుపై మాజీ ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టులో ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఆయన తరపున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. 
 
కాగా, ఏపీ సర్కారు తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేసింది. పైగా, రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి నియమించాలంటూ ఆదేశాలు జారీచేసింది. అయితే, జగన్ సర్కారు మాత్రం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 
 
అక్కడ కూడా ఏపీ సర్కారుకు చుక్కుదురైంది. పైగా, ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేదు. అలాగని, ఎస్ఈసీగా తిరిగి రమేష్ కుమార్‌నే నియమించాలన్న స్పష్టత ఇవ్వలేదు. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయం తీసుకుని, పిటిషన్ దాఖలు చేయనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరాముడు- గోమాత దయతో కరోనా వైరస్ సోకలేదు : రాజాసింగ్