Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిందితులను గుర్తించిన తర్వాత బాదుడే బాదుడు : తమ్మినేని సీతారాం

Webdunia
బుధవారం, 25 మే 2022 (17:58 IST)
కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో హింసాత్మక చర్యలకు కారణమైన నిందితులను గుర్తించిన తర్వాత అపుడుంటది బాదుడే బాదుడు అని ఏపీ స్పీకర్, వైకాపా నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఈ హింసాత్మక ఘటనలపై ఆయన స్పందిస్తూ, కోనసీమ అల్లర్లు బాధాకరమన్నారు. జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. 
 
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుభవిస్తూ, ఆయన పేరును మాత్రం వ్యతిరేకిస్తారా? అంటూ తమ్మినేని ప్రశ్నించారు. ఈ అల్లర్ల వెనుక ఎవరు ఉన్నారో త్వరలో తెలుస్తుందన్నారు. నిందితులను గుర్తించిన తర్వాత బాదుడే బాదుడు కార్యక్రమం మొదలుపెడతామని హెచ్చరించారు. అంతేకాకుండా, శ్రీకాకుళం జిల్లాకు అంబేద్కర్ -2 పేరు పెట్టమనండి, ఏ రాజకీయ పార్టీ అడ్డుకుంటుందో చూస్తానంటూ అన్నారు. 
 
రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. అందువల్ల కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదని పైగా ఇది నూటికి కోటి శాతం కరెక్టేనని చెప్పారు. కులాలు, మతాలు, జాతుల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదని తమ్మినేని హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments