Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిందితులను గుర్తించిన తర్వాత బాదుడే బాదుడు : తమ్మినేని సీతారాం

Webdunia
బుధవారం, 25 మే 2022 (17:58 IST)
కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో హింసాత్మక చర్యలకు కారణమైన నిందితులను గుర్తించిన తర్వాత అపుడుంటది బాదుడే బాదుడు అని ఏపీ స్పీకర్, వైకాపా నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఈ హింసాత్మక ఘటనలపై ఆయన స్పందిస్తూ, కోనసీమ అల్లర్లు బాధాకరమన్నారు. జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. 
 
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుభవిస్తూ, ఆయన పేరును మాత్రం వ్యతిరేకిస్తారా? అంటూ తమ్మినేని ప్రశ్నించారు. ఈ అల్లర్ల వెనుక ఎవరు ఉన్నారో త్వరలో తెలుస్తుందన్నారు. నిందితులను గుర్తించిన తర్వాత బాదుడే బాదుడు కార్యక్రమం మొదలుపెడతామని హెచ్చరించారు. అంతేకాకుండా, శ్రీకాకుళం జిల్లాకు అంబేద్కర్ -2 పేరు పెట్టమనండి, ఏ రాజకీయ పార్టీ అడ్డుకుంటుందో చూస్తానంటూ అన్నారు. 
 
రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. అందువల్ల కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదని పైగా ఇది నూటికి కోటి శాతం కరెక్టేనని చెప్పారు. కులాలు, మతాలు, జాతుల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదని తమ్మినేని హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Idli Kottu Review: ధనుష్ ఇడ్లీ కొట్టుతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా... ఇడ్లీ కొట్టు రివ్యూ

Nayana tara: మన శంకర వర ప్రసాద్ గారు జీవితంలో శశిరేఖ ఎవరు...

పవన్ కళ్యాణ్ "ఓజీ" : 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటున్న నేహాశెట్టి

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments