Webdunia - Bharat's app for daily news and videos

Install App

22న ఏపీ మంత్రి వర్గ విస్తరణ

Webdunia
సోమవారం, 20 జులై 2020 (17:48 IST)
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించనుంది. ఈ మేరకు ఈ నెల 22 తేదీన ఒంటి గంట తర్వాత కేబినెట్ విస్తరణ జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. అదే రోజు ఇద్దరు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం.

రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వేణుగోపాలకృష్ణకు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో మంత్రిపదవి దక్కనుంది.

అటు మోపిదేవి వెంకటరమణ సామాజికి వర్గానికి డా.సీదిరి అప్పలరాజు తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఇదే సమయంలో మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని అధికార పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. 

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని ఏపీ సీఎం జగన్‌ నిర్ణయించుకున్నారు. దీంతో రాయచోటికి చెందిన మైనార్టీ మహిళా నేత మైనా జకియాఖానుం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన మోసేను రాజుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments