Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా టిక్కెట్ల విక్రయంపై దుష్ప్రచారం మానుకోండి : మంత్రి పేర్ని నాని

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (17:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల విక్రయం కూడా ప్రభుత్వం వెబ్ సైట్ ద్వారా జరుగనున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. పైగా, చిత్రపరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పేర్ని నాని స్పందించారు. 
 
ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను విక్రయించనున్నట్లు వస్తున్న వార్తలపై దుష్ప్రచారం తగదని హితవు పలికారు. ప్రభుత్వంపై విపక్ష నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనే విషయంపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు. 
 
ఈ అంశంపై కమిటీలు వేశామని అధ్యయనం జరుగుతోందన్నారు. త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని నిర్ణయం తీసుకుంటామన్నారు. 
 
ఈ విషయంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పని ఏది చేపట్టినా విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తు్న్నారని పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments