Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ సర్కారు తీపికబురు : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్

ఏపీ సర్కారు తీపికబురు : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్
, మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (10:45 IST)
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో ప్రమోషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిపింది. ఫలితంగా దాదాపుగా వెయ్యిమందికి పైగా పదోన్నతులు లభించనున్నాయి. 
 
ఈ పదోన్నతులను అధికారుల స్థాయిలో తక్కువగా.. ఉద్యోగులు, కార్మికుల స్థాయిలో ఎక్కువగా కల్పించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మెకానిక్‌లు, జూనియర్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, అసిస్టెంట్‌ డిపో మేనేజర్లు, కంట్రోలర్లు, గ్యారేజ్‌ సూపర్‌వైజర్లు, ట్రాఫిక్‌ సూపర్‌వైజర్లు తదితర ఉద్యోగులు ఎక్కువ మందికి ప్రయోజనం కలిగే విధంగా పదోన్నతుల ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యం సూత్రప్రాయంగా ఆమోదించింది. 
 
కాగా, ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ప్రతి ఒక్కరికీ ఒక ర్యాంకు పెరగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత తొలిసారిగా పదోన్నతులు కల్పించనుండటంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నెలాఖరుకు పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు తుది కసరత్తు ముమ్మరం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవూరులో కల్వర్టును ఢీకొన్న కారు... మామ - కోడలు మృతి