Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవూరులో కల్వర్టును ఢీకొన్న కారు... మామ - కోడలు మృతి

కోవూరులో కల్వర్టును ఢీకొన్న కారు... మామ - కోడలు మృతి
, మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (10:42 IST)
నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ప్రమాదం గురించి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. నెల్లూరులోని హరినాథపురానికి చెందిన పార్లపల్లి మహేంద్ర తన కుటుంబంతో కలిసి కుమారుడిని తూర్పు గోదావరి జిల్లా తునిలో ఉన్న హాస్టల్‌లో చేర్పించి తిరుగు పయనమయ్యారు. 
 
ఈ క్రమంలో కోవూరులోని ఏసీసీ కల్యాణ మండపం వద్దకు రాగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో కారులో ఉన్న మహేంద్ర తండ్రి పార్లపల్లి సుధాకర్‌రావు(76), భార్య అపర్ణ(35) అక్కడికక్కడే మృతిచెందారు. 
 
ఈ ప్రమాదంలో మహేంద్రతో పాటు అతడి తల్లి వెంకట సుజాత, కూతురు సిసింద్రి(6) గాయపడ్డారు. క్షతగాత్రులను నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో పీజీ వైద్య సీట్లు రెట్టింపు చేసుకునే అవ‌కాశం