Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది దుర్మరణం

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది దుర్మరణం
, సోమవారం, 13 సెప్టెంబరు 2021 (10:17 IST)
కర్నాటక రాష్ట్రంలోని చిక్‌బల్లాపూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే మరణించారు. 
 
దినసరి కూలీలతో వెళ్తున్న జీపు చింతామణి సమీపంలోని మరనాయకహళ్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఎనిమిది మృతిచెందారని, వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని, వారంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. 
 
వారంతా కూలీలని, పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని వెల్లడించారు. గాయపడినవారిని దవాఖానకు తరలించామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేటి నుంచి టీఎస్ఈసెట్ తుదివిడత కౌన్సెలింగ్