Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని అమరావతి కోసం పదో 10 ఎకరాల భూమి సేకరణ : మంత్రి నారాయణ

ఠాగూర్
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (14:30 IST)
రాజధాని అమరావతి నిర్మాణం కోసం పది ఎకరాల భూమిని సేకరించినట్టు ఏపీ పురపాలక శాఖామంత్రి పి.నారాయణ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అనేక మంది రైతుల నుంచి 10.37 ఎకరాల సేకరించినట్టు చెప్పారు. తమను సంప్రదిస్తే ఇళ్లకే వెళ్లి భూములు తీసుకుంటామన్నారు.
 
అలాగే, భూములిచ్చే రైతులకు వారు కోరుకున్న చోట స్థలాల కేటాయింపు చేపడుతామన్నారు. భూ సమీకరణలో భాగంగా ఎర్రబాలెంలో రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నారు. ఎర్రబాలెం గ్రామంలో పది మంది రైతుల నుంచి 10.37 ఎకరాల భూమిని సేకరించారు.
 
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చే వారికి, వారు కోరుకున్న చోట స్థలాలు కేటాయిస్తామన్నారు. రైతులు తమను సంప్రదిస్తే ఇళ్లకే వెళ్లి భూములను తీసుకుంటామని చెప్పారు. అమరావతిలో ఎల్లుండి నుంచి జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నట్టు తెలిపారు.
 
ఇక, బుడమేరుకు మళ్లీ వరదలు వస్తున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి నారాయణ స్పందించారు. మళ్లీ వరదలు వస్తున్నాయన్న ప్రచారం వైసీపీ కుట్ర అని ఆరోపించారు.  ఈ వదంతులు ఏవీ నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. వరదలపై సోషల్ మీడియాలో కనిపిస్తున్న అసత్య పోస్టులపై డీజీపీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇలాంటి దుష్ప్రచారం చేస్తే... చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments