Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని అమరావతి కోసం పదో 10 ఎకరాల భూమి సేకరణ : మంత్రి నారాయణ

ఠాగూర్
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (14:30 IST)
రాజధాని అమరావతి నిర్మాణం కోసం పది ఎకరాల భూమిని సేకరించినట్టు ఏపీ పురపాలక శాఖామంత్రి పి.నారాయణ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అనేక మంది రైతుల నుంచి 10.37 ఎకరాల సేకరించినట్టు చెప్పారు. తమను సంప్రదిస్తే ఇళ్లకే వెళ్లి భూములు తీసుకుంటామన్నారు.
 
అలాగే, భూములిచ్చే రైతులకు వారు కోరుకున్న చోట స్థలాల కేటాయింపు చేపడుతామన్నారు. భూ సమీకరణలో భాగంగా ఎర్రబాలెంలో రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నారు. ఎర్రబాలెం గ్రామంలో పది మంది రైతుల నుంచి 10.37 ఎకరాల భూమిని సేకరించారు.
 
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చే వారికి, వారు కోరుకున్న చోట స్థలాలు కేటాయిస్తామన్నారు. రైతులు తమను సంప్రదిస్తే ఇళ్లకే వెళ్లి భూములను తీసుకుంటామని చెప్పారు. అమరావతిలో ఎల్లుండి నుంచి జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నట్టు తెలిపారు.
 
ఇక, బుడమేరుకు మళ్లీ వరదలు వస్తున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి నారాయణ స్పందించారు. మళ్లీ వరదలు వస్తున్నాయన్న ప్రచారం వైసీపీ కుట్ర అని ఆరోపించారు.  ఈ వదంతులు ఏవీ నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. వరదలపై సోషల్ మీడియాలో కనిపిస్తున్న అసత్య పోస్టులపై డీజీపీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇలాంటి దుష్ప్రచారం చేస్తే... చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ చంపగలదు, అతి ప్రేమ భయానకంగా ఉంటుంది: రామ్ గోపాల్ వర్మ

ఔట్ డోర్, ఇంట్లో జానీ మాస్టర్ నాపై లైంగిక దాడి చేశాడు.. యువతి

పుష్ప 2 నుంచి ఆసక్తికర పాయింట్ లీక్ - కేరళీయులకు ఓనమ్ శుభాకాంక్షలు అల్లు అర్జున్

చారిత్రక నేపథ్య కథతో కార్తీ 29 సినిమా ప్రకటన - 2025లో రిలీజ్ కు ప్లాన్

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments