Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలతో సీఎంసీఎం అంటూ నినాదాలు చేయించుకునే వ్యక్తి పవన్ : కొడాలి నాని

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:29 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి కొడాలి నాని మరోమారు విమర్శలు గుప్పించారు. ఓటు హక్కు లేని పిల్లలతో సీఎం సీఎం అంటూ నినాదాలు చేయించుకునే వ్యక్తి పవన్ అని ఎద్దేవా చేశారు. 
 
పేమెంట్ కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సొల్లు కబుర్లు చెబుతార‌ని ఆయ‌న అన్నారు. జ‌న‌సేన సైనికులు ఇప్పుడు జన సైకిల్‌గా మారారని వ్యాఖ్యానించారు. డబ్బులు ఇస్తే క్యాల్షీట్ పూర్తి చేసి వెళ్లే పవన్ కూడా రాజకీయాల గురించి మాట్లాడితే ఎలా అంటూ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. 
 
ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో మంగ‌ళ‌గిరిలో చిత్తుగా ఓడినప్పటికీ నారా లోకేశ్‌కు, ఆయన తండ్రి చంద్రబాబుకు బుద్ధి రాలేదన్నారు. ఎన్నిక‌ల్లో ఇక‌పై చంద్రబాబుకు డిపాజిట్లు కూడా వస్తాయో రావోన‌ని విమ‌ర్శించారు. 
 
సీపీఎం, బీజేపీ పార్టీల‌కు నోటాకు ప‌డిన‌న్ని ఓట్లు కూడా ప‌డ‌వ‌ని ఆయన జోస్యం చెప్పారు. ఏపీలో స్వర్ణపాలన సాగుతోందని, సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments