Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 ఎన్నికల్లో చంద్రబాబును కసితీరా బాదేశారు : ఏపీ మంత్రి గుడివాడ

Webdunia
బుధవారం, 4 మే 2022 (17:29 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై అన్ని రకాల వస్తువుల ధరలు, విద్యుత్, నిత్యావసర ధరలు, ఆర్టీసీ చార్జీలను విపరీతంగా పెంచేశారు. దీంతో విపక్షాలు జగన్ ప్రభుత్వంపై బాదుడే బాదుడు పేరుతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టలేక వైకాపా నేతలు, మంత్రులు విఫలమవుతున్నారు. తాజాగా చంద్రబాబుతో టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. 
 
ఎన్నికలు జరిగిన మూడేళ్లకు చంద్రబాబుకు రాష్ట్రం గుర్తొచ్చిందన్నారు. బాదుడే బాదుడు నినాదంతో చంద్రబాబును బాదాలా? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లోనే చంద్రబాబును ప్రజలు చితికబాదారని గుర్తుచేశారు. 
 
రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు శ్రీకారం చుట్టారని ఆయన ఆరోపించారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో వీడియో తీసిన ఘటనపై విచారణ జరిపిన బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments