Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి - మోహన్ బాబు వంటి పెద్దలకు లేని దూల పవన్‌కు ఎందుకు : మంత్రి బొత్స

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (14:59 IST)
వైకాపా ప్రభుత్వ పనితీరును తూర్పారబట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నోరుందికదాని ఇష్టానుసారంగా పారేసుకుంటే సహించబోమని హెచ్చరించారు.

ఆయన ఆదివారం విజయనగరంలో సిరిమాను ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. 'సినిమా టికెట్ల అంశంలో జనసేన అధినేత పవన్‌ వ్యాఖ్యలు సరికాదు. టికెట్ల ధరలు ఇష్టానుసారం పెంచేస్తామంటే కుదరదు. ప్రజలపై భారం వేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? జీఎస్టీ వంటి పన్నులను స్ట్రీమ్‌లైన్‌ చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ విధానాన్ని డిస్ట్రిబ్యూటర్లే అడిగారు. నోరుందని పవన్‌ ఇష్టానుసారంగా మాట్లాడతారా? ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి.
 
చిత్ర పరిశ్రమలో పవన్‌తో పాటు చాలా మంది ఉన్నారు. చిరంజీవి, మోహన్‌బాబు వంటి పెద్దలు ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు. ప్రభుత్వం మంత్రుల గురించి మాట్లాడేటప్పుడు అదుపులో ఉండాలి' అని బొత్స హితవు పలికారు. రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందనే వార్తల నేపథ్యంలోనూ ఆయన స్పందించారు. 'మంత్రివర్గ విస్తరణ అనేది సీఎం ఇష్టం. మంత్రివర్గంపై పూర్తి స్వేచ్ఛ ఉంది. సీఎం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే' అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments