మణికొండలో గోతిలో పడి చనిపోయిన వ్యక్తి గుర్తింపు...

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (14:36 IST)
హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి రెండు గంటల పాటు కుంభవృష్టి కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమలో మ‌ణికొండ‌లో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంత‌లో ఓ వ్యక్తి పడి గల్లంతయ్యాడు. 
 
ఆ వ్యక్తిని జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. అతని పేరు గోపిశెట్టి ర‌జ‌నీకాంత్ (42)గా పోలీసులు గుర్తించారు. అత‌డి ఇల్లు ఘ‌ట‌నాస్థ‌లికి 50 మీట‌ర్ల దూరంలోనే ఉంది. అత‌డు షాద్ న‌గ‌ర్‌లోని నోవా గ్రీన్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తున్నాడు.
 
శనివారం రాత్రి 9 గంట‌ల‌కు ఇంటిని నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి నీటిలో ఉన్న డ్రైనేజీ గుంత‌ను చూసుకోకుండా అడుగు వేయడంతో అందులో ప‌డ్డాడు. అత‌డి కోసం 2 డీఆర్ఎఫ్ బృందాలు 15 గంట‌లుగా గాలిస్తున్నాయి. 
 
ప్ర‌స్తుతం నాలాలు క‌లిసే ప్రాంతంలో ర‌జనీకాంత్ కోసం ఓ బృందం గాలిస్తోంది. అలాగే, చెరువు వ‌ద్ద కూడా మ‌రో బృందం గాలిస్తోంది. కాగా శనివారం రాత్రి ఏకధాటిగా కురిసిన వర్షంతో హైద‌రాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు నీట‌ మునిగిన విష‌యం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోయాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: మార్కెటింగ్ నా చేతుల్లో లేదు, ఇండియా గర్వపడే సినిమాగా బైకర్ :శర్వా

Soumith Rao: మ్యూజికల్ లవ్ డ్రామాగా నిలవే రాబోతుంది

VK Naresh: క్రేజీ కల్యాణం నుంచి పర్వతాలు పాత్రలో వీకే నరేష్

Megastar Chiranjeevi: మన శంకర వర ప్రసాద్ గారు విజయంపై చిరంజీవి ఎమోషనల్ మెసేజ్

ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు: మన శంకరవరప్రసాద్ గారు చిత్రంపై మెగాస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో లేయర్స్ ప్రైవ్‌ను ప్రారంభించిన లేయర్స్ క్లినిక్స్

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

తర్వాతి కథనం
Show comments