మణికొండలో గోతిలో పడి చనిపోయిన వ్యక్తి గుర్తింపు...

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (14:36 IST)
హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి రెండు గంటల పాటు కుంభవృష్టి కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమలో మ‌ణికొండ‌లో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంత‌లో ఓ వ్యక్తి పడి గల్లంతయ్యాడు. 
 
ఆ వ్యక్తిని జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. అతని పేరు గోపిశెట్టి ర‌జ‌నీకాంత్ (42)గా పోలీసులు గుర్తించారు. అత‌డి ఇల్లు ఘ‌ట‌నాస్థ‌లికి 50 మీట‌ర్ల దూరంలోనే ఉంది. అత‌డు షాద్ న‌గ‌ర్‌లోని నోవా గ్రీన్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తున్నాడు.
 
శనివారం రాత్రి 9 గంట‌ల‌కు ఇంటిని నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి నీటిలో ఉన్న డ్రైనేజీ గుంత‌ను చూసుకోకుండా అడుగు వేయడంతో అందులో ప‌డ్డాడు. అత‌డి కోసం 2 డీఆర్ఎఫ్ బృందాలు 15 గంట‌లుగా గాలిస్తున్నాయి. 
 
ప్ర‌స్తుతం నాలాలు క‌లిసే ప్రాంతంలో ర‌జనీకాంత్ కోసం ఓ బృందం గాలిస్తోంది. అలాగే, చెరువు వ‌ద్ద కూడా మ‌రో బృందం గాలిస్తోంది. కాగా శనివారం రాత్రి ఏకధాటిగా కురిసిన వర్షంతో హైద‌రాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు నీట‌ మునిగిన విష‌యం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోయాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఆసక్తికర సన్నివేశాలు.. మహేష్ క్లారిటీ (video)

Suriya: ఎమోషనల్ డ్రామాగా సూర్య నటించిన విశ్వనాథ్ & సన్స్ టీజర్

Anand Deverakonda: ఎపిక్ మూవీ ప్రోమో - రావులపాలెంలో ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు

Priyadarshi: సుయోధన క్యారెక్టర్ సాయికుమార్ గారినే అనుకున్నా : వై ఎస్ మాధవ్ రెడ్డి

Chadalavada: పొడ్రూసర్స్ గిల్డ్‌ విషపురుగు, ఇండస్ట్రీకి చిన్న నిర్మాతలే ముఖ్యం : చదలవాడ శ్రీనివాసరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీర బరువు పెరిగితే వచ్చే వ్యాధులు ఏమిటి?

ఇలా చేస్తే మూత్రపిండాలు ఆరోగ్యంగా వుంటాయి

శరీర మర్దనకు ఎలాంటి నూనెలు వాడాలి?

పొట్ట మసాజ్, ప్రయోజనాలు ఏమిటి?

డయాబెటిస్‌, గుండె, మూత్రపిండాల ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడానికి అబోట్ ICRAS సాధనం

తర్వాతి కథనం
Show comments