Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయల్ బెంగాల్ దంపతులకు ఐదు పిల్లలు.. ఒకదానికి 'జగన్' పేరు

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (10:01 IST)
తిరుపతిలో శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల వుంది. ఇందులో రాయల్ బెంగాల్ టైగర్స్ ఉన్నాయి. వీటిలో సమీర్ - రాణి పులుల జంటకు ఐదు పులి పిల్లలు పుట్టాయి. ఈ పిల్లలు నామకరణం వైభవంగా జరిగింది. రాష్ట్ర అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఈ పిల్లలకు పేర్లు ఖరారు చేసి పెట్టారు. వీటిలో ఓ పిల్లకు జగన్ అని పేరు పెట్టారు. 
 
తిరుపతి జూలో తెల్ల పులుల జంట సమీర్, రాణిలకు ఐదు పిల్లలు పుట్టాయి. వీటిలో మూడు మగ కూనలు, రెండు ఆడ కూనలు ఉన్నాయి, మగ పిల్లలకు వాసు, సిద్ధాన్, జగన్ అని, ఆడ కూనలకు విజయ, దుర్గ అనే పేర్లను బాలినేని ఖరారు చేశారు.
 
కాగా, మగ కూనల్లో చిన్నదానికి తమ అధినేత పేరును పెట్టడం ద్వారా, ఆయనపై తనకున్న అభిమానాన్ని బాలినేని చాటుకున్నట్లయింది. ఇక, పెద్ద కూనకు పెట్టిన పేరుపైనా చర్చ జరుగుతోంది. 
 
బాలినేనిని ప్రకాశం జిల్లాలో అభిమానులంతా 'వాసు' అని పిలుస్తుంటారు. ఇప్పుడీ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ ఐదు కూనలనూ చూసేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

మెగా పవర్ స్టార్‌కు గౌరవ డాక్టరేట్.. ప్రకటించిన చెన్నైలోని ప్రైవేట్ వర్శిటీ!!

జూనియర్ ఎన్.టి.ఆర్. వార్ 2లో ఎంట్రీ లుక్ అదుర్స్

సోషల్ మీడియా ద్వారా దిల్ రాజు కోరిక నెరవేనా?

ఫ్యామిలీ స్టార్ హిట్టా ఫట్టా? కంప్లైంట్ చేస్తానన్న విజయ్ దేవరకొండ

బ్యాంక్ క్యాషియర్‌గా లక్కీ భాస్కర్ లో దుల్కర్ సల్మాన్

వేసవిలో చల్లని తాండాయి పానీయం తాగితే 7 అద్భుత ప్రయోజనాలు

ఇంజెక్షన్ చేసిన పుచ్చకాయలు, ఈ 5 పద్ధతుల ద్వారా గుర్తించవచ్చు

బ్రెయిన్ పవర్‌ ఫుడ్ ఏంటో తెలుసా?

వేసవిలో గ్లాసు కివీ జ్యూస్ తాగడం వల్ల 10 ప్రయోజనాలు

ప్రతిరోజూ 3,500 మందిని కబళిస్తున్న హెపటైటిస్ వైరస్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ

తర్వాతి కథనం
Show comments