Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒళ్లు బలిసి పాదయాత్ర చేస్తున్నారు : మంత్రి అంబటి రాంబాబు

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (13:08 IST)
అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై వైకాపా నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రైతులను రెచ్చగొట్టేలా, వారి మనోభావాలు దెబ్బతినేలా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు రైతులను ఉద్దేశించి ఘాటైన వాఖ్యలు చేశారు. రైతులు ఒళ్లు బలిసి పాదయాత్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
కృష్ణా జిల్లా కోడూరు మండలంలో నిర్వహించిన మూడో విడత చేయూత కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, అమరావతి ప్రాంతంలో రాజధాని కావాలనే పేద రైతులు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరన్నారు. యాత్ర చేసేవారంతా ఒళ్లు బలిసి చేస్తున్న వారేనని, వారంతా డబ్బున్నవారన్నారు. 
 
అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తుందని ముందే తెలుసుకున్న పలువురు టీడీపీ నేతలు ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారన్నారు. ఇపుడు వారి భూములకు విలువ తగ్గిపోతుందని భయంతో అమరవాతి రైతుల పేరిట రాజకీయ యాత్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజధాని కావాలంటే గుడివాడ వెళ్లి తొడ కొడితేనే, మీసం మెలేస్తేనే రాదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments