Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒళ్లు బలిసి పాదయాత్ర చేస్తున్నారు : మంత్రి అంబటి రాంబాబు

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (13:08 IST)
అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై వైకాపా నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రైతులను రెచ్చగొట్టేలా, వారి మనోభావాలు దెబ్బతినేలా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు రైతులను ఉద్దేశించి ఘాటైన వాఖ్యలు చేశారు. రైతులు ఒళ్లు బలిసి పాదయాత్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
కృష్ణా జిల్లా కోడూరు మండలంలో నిర్వహించిన మూడో విడత చేయూత కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, అమరావతి ప్రాంతంలో రాజధాని కావాలనే పేద రైతులు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరన్నారు. యాత్ర చేసేవారంతా ఒళ్లు బలిసి చేస్తున్న వారేనని, వారంతా డబ్బున్నవారన్నారు. 
 
అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తుందని ముందే తెలుసుకున్న పలువురు టీడీపీ నేతలు ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారన్నారు. ఇపుడు వారి భూములకు విలువ తగ్గిపోతుందని భయంతో అమరవాతి రైతుల పేరిట రాజకీయ యాత్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజధాని కావాలంటే గుడివాడ వెళ్లి తొడ కొడితేనే, మీసం మెలేస్తేనే రాదన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments