Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒళ్లు బలిసి పాదయాత్ర చేస్తున్నారు : మంత్రి అంబటి రాంబాబు

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (13:08 IST)
అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై వైకాపా నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రైతులను రెచ్చగొట్టేలా, వారి మనోభావాలు దెబ్బతినేలా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు రైతులను ఉద్దేశించి ఘాటైన వాఖ్యలు చేశారు. రైతులు ఒళ్లు బలిసి పాదయాత్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
కృష్ణా జిల్లా కోడూరు మండలంలో నిర్వహించిన మూడో విడత చేయూత కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, అమరావతి ప్రాంతంలో రాజధాని కావాలనే పేద రైతులు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరన్నారు. యాత్ర చేసేవారంతా ఒళ్లు బలిసి చేస్తున్న వారేనని, వారంతా డబ్బున్నవారన్నారు. 
 
అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తుందని ముందే తెలుసుకున్న పలువురు టీడీపీ నేతలు ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారన్నారు. ఇపుడు వారి భూములకు విలువ తగ్గిపోతుందని భయంతో అమరవాతి రైతుల పేరిట రాజకీయ యాత్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజధాని కావాలంటే గుడివాడ వెళ్లి తొడ కొడితేనే, మీసం మెలేస్తేనే రాదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments