Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాబ్ కార్నర్ : డీఆర్డీవోలో సైంటిస్ట్ పోస్టులు

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (12:37 IST)
ఢిల్లీలోని భారత రక్షణ పరిశోధనా సంస్థ డీఆర్డీవోకు చెందిన రిక్రూట్మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (ఆర్ఏసీ) కింద మొత్తం 17 సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను డీఆర్డీవో ఆహ్వానిస్తుంది. 
 
సైంటిస్ట్-బి విభాగం కింద భర్తీ చేసే ఈ 17 ఖాళీలను అప్లయిడ్ సైకాలజీ, హెల్త్ సైకాలజీ, కౌన్సెలింగ్ / గైడెన్స్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, మిలిటరీ సైకాలజీ, కాగ్నిటివ్ సైకాలజీ, ఫిజియోలజికల్ సైకాలజీ తదితర విభాగాలు ఉన్నాయి. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థుల సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అలాగే, గేట్ లేదా నెట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 28 యేళ్ళకు మించరాదు. 
 
దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులైన అభ్యర్థులను స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఈ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజును 100 రూపాయలు చెల్లించి, ఉద్యోగ ప్రకటన వెలువడిన 28 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments