Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో ఉంటూ చంద్రబాబు చౌకబారు రాజకీయాలు

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (17:47 IST)
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 78 లక్షల మందికి 6, 440 కోట్లు రెండో విడత వైఎస్సార్‌ ఆసరా ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందించారని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. రెండు విడతల్లో కలిపి 12,700 కోట్లు నేరుగా లబ్దిదారుల అకౌంట్‌లోకి వేశారని అనిల్‌ కుమార్‌ తెలిపారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ మహిళలను అప్పుల ఊబిలోనుంచి బయటకు తీసుకు రావాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన. మహిళా సాధికారత కోసం పధకాలు తీసుకొచ్చారు’ అని తెలిపారు. 
 
‘సున్నా వడ్డీ ని  కూడా చంద్రబాబు నిర్వీర్యం చేశారు.  ఆ అప్పు 3000 వేల కోట్ల భారాన్ని కూడా ప్రభుత్వం భరిస్తోంది. టీడీపీ హయాంలో మహిళలకు ఒక్క ఇల్లు కూడా ఉచితంగా ఇవ్వలేదు. టిడ్కో ఇళ్ల పేరుతో ఋణ భారం మోపాలని చూశారు. సీఎం వైఎస్ జగన్ టిడ్కో ఇళ్లను కూడా ఉచితంగా అందిస్తున్నారు. 4 వేల కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. హైదరాబాద్ లో ఉంటూ అప్పుడుడప్పుడూ వచ్చి చంద్రబాబు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు’ అని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments