'బిగ్ బాస్' షోల వల్ల సమాజంలో వింత పోకడలు - ఏపీ హైకోర్టు

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (14:35 IST)
బిగ్ బాస్ షో‌ అశ్లీలతను, అసభ్యతను ప్రోత్సహిస్తుందంటూ తమిళనాడుకు చెందిన తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గత 2019లో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు స్వీకరిచింది. ఈ పిటిషన్‌పై అప్పటి నుంచి ఇప్పటివరకు విచారణకు నోచుకోలేదు. దీంతో ఆయన తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి మరోమారు ఈ పిటిషన్ వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. 
 
దీనిపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అమానుల్లా, జస్టిస్ టి.రాజశేఖర్ రావులతో కూడిన ధర్మానం కీలక వ్యాఖ్యలు చేసింది. మంచి వ్యాజ్యమని ప్రశంసించింది. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అశ్లీలతను పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. బిగ్ బాస్ వంటి కార్యక్రమాల వల్ల యువత పెడదారిపడుతోందని, ఇలాంటి వాటి వల్ల సమాజంలో విపరీత పోకడలు పెరిగిపోతున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
 
ముఖ్యంగా మన పిల్లలు బాగున్నారని ఇలాంటి షోలలో తమకేం పని అని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించిది. ఇతరుల గురించి పట్టించుకోకపోతే భవిష్యత్‌లో మనకు సమస్య ఎదురైనపుడు వారు కూడా పట్టించుకోరని కోర్టు గుర్తుచేసింది. 2019లో ఈ వ్యాజ్యం దాఖలు చేస్తే ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వక పోవడంపై హైకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని పిటిషనర్ న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మాసనం సోమవారం విచారణ చేపడుతామని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments