Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు ధిక్కరణ : ఏపీలో 8 మంది ఐఏఎస్‌లకు జైలుశిక్ష

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (12:47 IST)
కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎనిమిది ఐఏఎస్‌ అధికారులు ఆ రాష్ట్ర హైకోర్టు జైలుశిక్షలు విధించింది. దీంతో శిక్షపడిన అధికారులు హైకోర్టును క్షమాపణలు చెబుతూ వేడుకున్నారు. ఫలితంగా జైలు శిక్షను తప్పించి ఇతర సేవా కార్యక్రమాలు చేయవలసిందిగా ఆదేశాలు జారీచేసింది. 
 
తమ ఆదేశాలను లెక్క చేయని ఐఏఎస్ అధికారులపై ఇటీవలి కాలంలో హైకోర్టు కన్నెర్ర జేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఏకంగా ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణ కింద 2 వారాల జైలుశిక్ష కూడా విధించింది. 
 
ఈ నేపథ్యంలో వీరంతా హైకోర్టును క్షమాపణలు కోరారు. దీంతో వీరికి జైలుశిక్ష నుంచి విముక్తిని కలిగించిన న్యాయస్థానం సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించింది. ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశాలు జారీచేసింది. 
 
సంక్షేమ హాస్టళ్ళలో యేడాది పాటు నెల లో ఒక రోజు సేవ చేయాలని స్పష్టం చేసింది. కాగా, జైలుశిక్ష పడిన ఐఏఎస్ అధికారుల్లో గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్, రాజశేఖర్, చిన వీరభద్రుడు, జే.శ్యామలరావు, విజయ్ కుమార్, ఎంఎం నాయక్, శ్రీలక్ష్మిలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments