Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల అమ్మకానికి ఏపీ హైకోర్టు ఓకే

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (11:54 IST)
థియేటర్లలో బ్లాక్ టిక్కెట్ల అమ్మకాలను నియంత్రించాలన్న ఏకైక ఉద్దేశ్యంతో సినిమా టిక్కెట్ల అమ్మకాలను ఆన్‌లైన్‌లో విక్రయించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అయితే, ఈ విధానాన్ని సినీ నిర్మాతల, చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులు తీవ్రంగా వ్యతిరేకించారు. 
 
ఈ అంశం కోర్టుకు చేరింది. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు.. ప్రస్తుతానికి సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అమ్ముకునేందుకు అనుమతిచ్చింది. కొంతకాలం ఆన్‌లైన్‌లో జరిగే టిక్కెట్ల అమ్మకాన్ని పరిశీలించిన తర్వాత తుది ఆదేశాలు జారీచేస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
 
ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా టిక్కెట్ల విక్రయానికి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఎలా ఉంటుందో కొన్ని రోజులు పరిశీలిద్ధామని పేర్కొంది. ముఖ్యంగా, మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు తమ సొంత వేదికలపై టిక్కెట్లు అమ్ముకునేందుకు ప్రస్తుతానికి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. అదేసమయంలో మల్టీప్లెక్స్ యాజమాన్యాల అభ్యర్థలను తదుపరి విచారణలో పరిశీలిస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments