Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మగిరి వేద పాఠాశాల కరోనా రోగులకు మెరుగైన చికిత్స : మంత్రి ఆళ్లనాని

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (17:03 IST)
తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా కలకలం పై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు స్విమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం డిఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్యతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 
 
తిరుపతి స్విమ్స్, రుయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లను, అధికారులను అప్రమత్తం చేశారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి స్విమ్స్ రుయాలో వెయ్యి పడకలు, మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు హోం క్వారంటైన్ లో ఉన్న వారికి మెడికల్ కిట్లు అందించాలని, ప్రతిరోజూ వైద్యులు పర్యవేక్షించాలని అన్నారు. 
 
డిఎంహెచ్ మాట్లాడుతూ ప్రస్తుతం స్విమ్స్, రుయాలో 120 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 300 మంది హోం క్వారంటైన్లో ఉన్నారన్నారు. ప్రతిరోజూ రెండు వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments