ప్రతిఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి... కలెక్టర్ ఇంతియాజ్

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (16:58 IST)
గుంటూరు జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో గత కొన్ని రోజులుగా కోవిడ్ - 19 కేసులు అధికంగా నమోదు అవుతున్న నేపథ్యంలో బుధవారం జగ్గయ్యపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో కృష్ణాజిల్లా కలెక్టర్  ఏ.యండి. ఇంతియాజ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను స్థానిక వైద్యులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్య బృందాలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు. 
 
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సుహాసిని, డీసిహెచ్‌ఎస్ జ్యోతిర్మయి, జిల్లా ఆరోగ్యశ్రీ క్లినిక్స్ కో- ఆర్దినేటర్ మోతి బాబు, తహశీల్దార్ రామకృష్ణ, మున్సిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్, ఎంపిడిఓ జయచంద్ర గాంధీ, రాకేం ఫార్మా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ యం సత్యనారాయణ రెడ్డి, సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ చినబాబు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments